Friday, 23 November 2012

జగన్‌కు బెయిల్ ఈ నెల 28కి వాయిదా?

అక్రమాస్తుల కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న భర్త జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ లభిస్తుందేమోనన్న గంపెడాశతో వచ్చిన జగన్ సతీమణి భారతికి నిరాశే ఎదురయ్యింది. జగన్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.

ఇకపోతే జగన్ మోహన్ రెడ్డి బెయిల్‌కు అనర్హుడంటూ సీబీఐ వాదించడాన్ని జగన్ తరపు న్యాయవాది తీవ్రంగా తప్పుబట్టారు. నిర్ణీత గడువులోగా ఛార్జిషీట్ వేయడంలో సీబీఐ పూర్తిగా విఫలమయిందన్నారు.

సెక్షన్ 67(2) ప్రకారం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ తీసుకునేందుకు పూర్తి అర్హుడని వాదించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వాటిపైనే సీబీఐ దర్యాప్తు చేస్తోందనీ, కొత్తగా వారేమీ చేస్తున్నది లేదు కనుక జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని ఈ నెల 28కి వాయిదా వేసింది

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .