హైదరాబాదులోని కాంచన్బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్లోని జావెద్ అలీ కుటుంబంలో ఆ సంఘటన గురువారం చోటు చేసుకుంది. అలీ పాతబస్తీలోని బట్టల దుకాణంలో పనిచేస్తాడు. బాబ్రీ మసీదు కూల్చివేతపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 6వ తేదీన పాతబస్టీలో బంద్ జరిగింది. దీంతో అలీ ఇద్దరు కూతుళ్లు ఆర్షియా, అమీనా ఇంట్లోనే ఉన్నారు.
పెద్ద కూతురు ఆర్షియా మలక్పేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె 14 ఏళ్ల చెల్లె అమీనా స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అమీనా టీవీ చూస్తుండగా ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇరువురి మధ్య గొడవ ప్రారంభమైంది. అర్షియా రిమోట్ తీసుకుని చానెళ్లను మార్చడం ప్రారంభించింది. దీంతో ఇరువురి మధ్య రిమోట్ కోసం పెనుగులాట జరిగింది.
ఆ సమయంలో తల్లిదండ్రులు జోక్యం చేసుకుని అమీనాకు మద్దతుగా నిలిచారు. టీవీ రిమెట్ చెల్లెకు ఇచ్చేయాలని అర్షియాకు చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అర్షియా వేరే గదిలోకి వెళ్లి తలుపులు వేసేసుకుంది. చాలా సేపటి వరకు కూతురు బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టారు. కూరుతు ఉరేసుకుని ఉండడం గమనించి, వెంటనే ఆస్పత్రికి తరలించారు.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .