Saturday, 1 December 2012

ఆకట్టుకునే సంభాషణల తో కృష్ణం వందే జగద్గురం


తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కృష్ణం వందే జగద్గురం. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రానా, నయనతార జంటగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సంభాషణలను సాయిమాధవ్ బుర్రా అందించారు. ఈ సినిమా కోసం ఆకట్టుకునే సంభాషణలను రాసిన సాయిమాధవ్ ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ లోనూ, సినీ అభిమానులోనూ హట్ టాపిక్ గా మారారు. కృష్ణం వందే జగద్గురం సినిమాలో ఆకట్టుకునే డైలాగ్స్ లో కొన్ని : ‘కళ అంటే బ్రతుకు నిచ్చేదే కాదు.. బ్రతుకు నేర్పేది కూడా..’ ‘అది కల నిద్దురలో కనేది.. ఇది కళ నిద్దుర లేపేది.’ ‘బ్రతుకు కోడి గుడ్డు లాంటింది భయ్యా.. ఏది పెద్దదవుతుందో, ఏది అమ్లెట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు’ ‘కొన్ని చావులు చూసి గర్వపడాలి’ ‘గర్భగుడిలో ఊరకుక్క ఉచ్చ పోసినంత మాత్రాన దేవుడు అపవిత్రం అయిపోడు.’, ‘ తొమ్మిది మాసాలు కష్ట పడి అమ్మ మనల్ని కన్నదని కొంత మంది అనుకుంటారు, నాన్న పక్కన పది నిమిషాలు సుఖ పడి మనల్ని కన్నదని మరికొంత మంది అనుకుంటారు, పడక సుఖం చూసినవాడు పశువు అవుతాడు. పురిటి కష్టం చూసిన వాడు మనిషి అవుతాడు’ ‘మా తరం వారు ఉన్నచోటనే స్వాతంత్ర్యం సంపాదించుకుంటే, ఈ తరం వారు స్వాతంత్ర్యం వెతక్కుంటూ వెళుతున్నారు.’ ‘60 హర్మోనియం పెట్టెలు ఒకేసారి ఆరున్న శృతిలో మోగితే ఎలా ఉంటుందో.. మా వాడు కొడితే అలా ఉంటుంది.’ ‘ హే అల్లా.. మళ్లి వచ్చింది పిల్ల’ ‘సర్కస్ మీడియా ఒకేలాంటివి. సర్కస్ లో బపూన్లు ఉంటారు. ఇక్కడ చూసే వారు బపూన్లు అవుతారు.’ ‘అడవిలో మనిషి చస్తే ఎవ్వరూ పట్టించుకోరు.. పట్నంలో మనిషి బ్రతుకుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు.’

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .