Thursday, 13 December 2012

కలిసి భోజనం చెసిన రామ్ చరణ్, ఎన్టీఆర్.


ఇద్దరు మెగా హీరోల కలయిక అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఫ్యాన్స్ కి పండగ... మీడియాకి ఇంకా పెద్ద పండగ. అదే జరిగింది. మరోసారి జరగబోతోంది. ఇంకోసారి జరగనుంది. వాళ్లిద్దరూ మరెవరో కాదు...  రామ్ చరణ్, ఎన్టీఆర్.
     
   . రామ్ చరణ్ నాయక్ లోనూ, ఎన్టీఆర్ బాద్షాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ లో ఒక యాదృచ్ఛిక సంఘటన జరిగింది. అదేంటంటే... వీళ్లిద్దరి సినిమాల షూటింగులూ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరూ... కలవాలని నిర్ణయించుకున్నారట. వెంటనే... కలిసి భోంచేశారు. నిజానికి టాలీవుడ్లోని స్నేహితుల జాబితాలో వీళ్లిద్దరినీ తప్పకుండా చేర్చాలి. ఎందుకంటే... గతంలో ఎన్టీఆర్ సినిమా ప్రారంభానికి చరణ్ వెళ్లాడు. ఆ తరవాత వీళ్లిద్దరూ ఒకే కారులో కలిసి వెళ్లారు. దాంతో వీళ్లిద్దరి మధ్యా ఉన్న స్నేహం బయటపడింది. ఆర్ ఎఫ్ సీలోని భోజనాల సంఘటనతో అది మరింత బలపడింది. వీరి భోజనాల సమయంలో వీళ్లిద్దరికీ సన్నిహితుడైన వి.వి.వినాయక్ కూడా ఉన్నాడట. వీళ్లిద్దరి మధ్యా సాన్నిహిత్యాన్ని తెలిపే మరో రెండు సంఘటనలూ త్వరలో జరగనున్నాయని సమాచారం. ఎన్టీఆర్ ను నాయక్ సినిమా ఆడియో వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించాడట రామ్ చరణ్. దానికి ఓకే అన్నాడట జూనియర్. సో, ఒకే స్టేజీ మీద నాయక్, బాద్షా కలిసి కనువిందు చేయనున్నారన్నమాట.  

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .