నాస్థాయిని ఎవరూ తగ్గించలేరు: చిరు:అభినంధనలు తెలిపిన పవన్ : తనకు మంత్రి పదవి హోదా కాదని, బాధ్యత అని చిరంజీవి శనివారం అన్నారు.
మంత్రిగా ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం రావడం తనకు సంతోషంగా ఉందని
చెప్పారు. ఏ శాఖ కేటాయించినప్పటికీ తాను సమర్థవంతంగా, శక్తిమేరకు
నిర్వహిస్తానని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు కాంగ్రెసు
పెద్దలందరికీ కృతజ్ఞతలు అన్నారు. తన స్థాయిని ఏ పదవులు పెంచలేవనీ, అలాగే
తగ్గించలేవని, చిరంజీవికి ప్రజల్లో మంచి ప్రాముఖ్యత ఉందని మెగాస్టార్ ఈ
సందర్భంగా చెప్పారు.
పీఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసినప్పుడు తాను
ఎలాంటి పదవులు అడగలేదని, డిమాండ్లు పెట్టలేదని చెప్పారు. తాను ఎప్పుడూ
ప్రజల మనిషినే అన్నారు. ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహించి ఆ
పదవికే వన్నె తెస్తానని, కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నట్లు
ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు చెప్పారని, ఈ బాధ్యతలను సమర్థంగా
నిర్వర్తించగలనన్న ధీమా తనకు ఎంతో ఉందని చిరంజీవి విలేకరులతో చెప్పారు.తనకు కేంద్ర మంత్రి పదవి దక్కిన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో కలసి పంచుకుంటున్నానని చిరంజీవి చెప్పారు. తల్లి అంజనాదేవి, భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన, తమ్ముడు నాగబాబులతో కలసి తాను ఢిల్లీకి వెళ్తున్నానని వివరించారు. విదేశాల్లో ఉన్న తమ్ముడు పవన్ కల్యాణ్ తనకు శుభాకాంక్షలు తెలిపాడని.. అందుబాటులో ఉంటే ఆయన కూడా తమతోపాటు ఢిల్లీకి వచ్చేవాడని వివరించారు.
తనకు అండదండలు అందిస్తున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, అధిష్ఠానం పెద్దలు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృతంగా కృషి చేస్తానని వివరించారు.
No comments:
Post a Comment
hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .