Monday, 4 February 2013

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు జేమ్స్ బాండ్ సినిమా??

సీతమ్మ వాకిట్లో..’ విజయవంతంగా సాగుతున్న సందర్భంగా ఆదివారం నాడు మహేష్ బాబు విలేకరులతో మాట్లాడాడు. ఇందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ‘సీతమ్మ..’ చిత్రం చేస్తున్నప్పడే ఒక మంచి చిత్రంలోనే నటించిన అనుభూతి కలిగిందని చెప్పాడు. మంచి చిత్రంలో నటించాలనే ఉద్దేశ్యంతో వెంకేష్, తాను ఆ సినిమాలో నటించామని, సినిమాలపై దిల్ రాజుకు మంచి అవగాహన ఉందని, అందుకే అతనికి అన్ని విజయాలు దక్కుతున్నాయిని మహేష్ అన్నాడు. ‘ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నానని, సహజత్వంతో కూడిన ఈ చిత్ర కథ యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని, ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదని, జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని’ మహేష్ తెలిపాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘ఆగడు’ సినిమా మార్చి నెలలో ప్రారంభమౌతుందని, ఆ తరువాత క్రిష్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్ ల దర్శకత్వంలో సినిమాలు చేస్తానని మహేష్ తెలిపాడు. అలాగే, ఆ చిత్రాలు పూర్తియ్యాక రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని, కథ గురించే ఇది వరకే మాట్లాడుకున్నామని ప్రిన్స్ ప్రకటించాడు. ‘గతంలో మణిరత్నం గారు ‘పొన్నియన్ సెల్వన్’ చేద్దామన్నారు. కానీ బడ్జెట్ మరీ ఎక్కువవుతుందని, తర్వాత చేద్దామని చెప్పారు. భవిష్యత్తులో ఆ సినిమా కూడా ఉండవచ్చేమో’ అని మహేష్ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. కాగా, ‘విశ్వరూపం’ వివాదంపై మహేష్ స్పందించాడు. ఆ సినిమాపై వివాదం రేగడం దురదృష్టమని, కమల్ హాసన్ కు తాను వీరాభిమానినని, అంత పెద్ద నటుడు ఓ ఇంటర్వ్యూలో అలా మట్లాడటం చూస్తే బాధ కలిగిందని మహేష్ చెప్పాడు. తెలుగు సినిమాల మార్కెట్ ప్రస్తుతం చాలా బాగుందని, హిట్ సినిమా పడ్డ ప్రతిసారీ టార్గెట్ రేంజ్ మారిపోతూనే ఉందని, అయితే పైరసీని కంట్రోల్ చేయాలని అన్నాడు.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .