Wednesday, 27 February 2013

సినీ నటీ ఫై అత్యాచారం?

. సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తున్న ఒక వర్ధమాన నటిపై స్పాట్‌బాయ్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను ఫైనాన్షియర్‌నని, పెద్ద బ్యానర్ల చిత్రాల్లో పాత్రలు ఇప్పిస్తానంటూ స్పాట్‌బాయ్‌ ముస్తఫా మసూద్‌ అలీ ఖాన్‌ (23) ఆమెను నమ్మించి రేప్ చేసాడు. అయితే పోలీస్ లు అతన్ని అరెస్టు చేసారు. ఈ విషయమై గోరెగావ్‌ ఇన్‌స్పెక్టర్‌ రేకుల్‌వాడ్‌ మాట్లాడుతూ.. ఆమె సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తోంది. పాత్రకు రూ.50 వేలు కావాలనుకుంటోంది. ఇందుకోసం ముస్తఫా అంగీకరించాడు. బదులుగా తన లైంగిక వాంఛలను తీర్చుకోవాలనుకున్నాడు. వాషికి చెందిన ఈ నటి గోరెగావ్‌ స్టూడియోలో ముస్తఫాను కలుసుకుంది. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అయిదుసార్లు అత్యాచారం జరిపాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముస్తఫాను అరెస్టు చేశారు.

Saturday, 16 February 2013

ప్రచారానికి దూరంగా జూనియర్ ఎన్టీఆర్:ఎందుకు??

ఎన్టీఆర్  కీ ఇటీవల కాలంలో పెద్దగా ప్లాపులు  లేవు, మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ  జూనియర్ విషయంపై ప్రచారం తగ్గడం ఆయన సన్నిహితుల్లోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు.స్టార్ హీరోల పేర్లు నిత్యం మీడియాలో ఉంటాయి. వారేం చేసినా, చేయకపోయినా వార్త అవుతుంది. అయితే టాలీవుడ్ విషయానికి వస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఈ మధ్య అంతగా వినిపించడం లేదు..ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ బాద్‌ షా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తన సినిమా వస్తున్న టైమ్ లో కూడా ఎన్టీఆర్.. తోటి హీరోల మాదిరిగా పెద్గగా హడావిడి చేయడం లేదు. మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, ప్రభాస్ వంటి హీరోలతో పోలిస్తే జూనియర్ ప్రచారానికి దూరంగానే ఉంటున్నాడు. మహేష్‌, చరణ్‌ నటించిన చిత్రాలు మార్కెట్లో ఉండడమే కాకుండా, ఏదో ఒక కారణం చూపుతూ వారు ప్రేక్షకుల మధ్యకు వెళుతున్నారు. కార్పోరేట్‌ సంస్థలకు అంబాసిడర్‌గా కూడా వారు చాలా ముందున్నారు. వారితో పోలిస్తే జూనియర్‌ కొంత వెనకపడ్డారని ఆయన అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఇలాంటివి సహజమని, వీటన్నింటికి సినిమా హిట్సే సమాధానం చెబుతాయని వాదించే వారూ ఉన్నారు. ..

ప్రేమేకులు రోజు రానా ఎక్కడ ఉన్నాడు ??





 త్రిష ఎమ్మెస్ రాజు తో రమ్ సినిమా చేస్తోంది. ఇందులో త్రిషతోపాటు చార్మి, నికిషా పటేల్, ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో ఈ నలుగురూ మంచి స్నేహితులైపోయారట. సో, ప్రేమికుల రోజు నేపథ్యంలో త్రిష మిగతా ముగ్గురికీ రెండురోజుల కిందట పార్టీ ఇచ్చిందట. అందులో ముగ్గురూ చాలా ఎంజాయ్ చేశారట. అయితే, ఈరోజు ప్రేమికుల రోజు సందర్భంగా త్రిషకి పార్టీ ఇవ్వడానికి దుబాయ్ కి ఒక ప్రత్యేక వ్యక్తి వెళ్లాడట. అతగాడు వెళ్లింది త్రిష కోసమేనట.ఇంతకీ అ రోజు  రానా ఎక్కడ ఉన్నాడు ??

: ఏడ్చిన ఆస్కార్?l

జోహన్నస్‌‍బర్గ్: ప్రియురాలిని దొంగగా భావించి తుపాకితో కాల్చి చంపిన దక్షిణాఫ్రికాకు చెందిన ఒలింపిక్ అండ్ పారాలింపిక్ అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ కోర్టులో ఏడ్చాడు. బ్లేడ్ రన్నర్ అస్కార్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. విచారణ సమయంలో పిస్టోరియస్ ముఖానికి చేతులు పెట్టుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. దంతో జడ్జి అతనిని ఊరడించి విచారణ ప్రారంభించాడు. రీవాను తాను హత్య చేయలేదని, పొరపాటున జరిగిందని చెప్పాడు. అమ్మాయిల పిచ్చి అందరూ అనుకుంటున్నట్టు పిస్టోరియలస్ అంత ఉత్తముడేమీ కాదని ఆయన మాజీ ప్రియురాలు సమంత టేలర్ గత ఏడాది ఓ సందర్భంలో చెప్పింది. పిస్టోరియస్‌తో సమంత ప్రేమాయణం కొద్దిరోజులు కొనసాగింది. ఆ తర్వాత బెడిసికొట్టింది. ఆ తర్వాత పిస్టోరియస్ రీవాతో ప్రేమలో పడ్డాడు. రీవా మృతి అనంతరం సమంత స్పందిస్తూ... అస్కార్ అమ్మాయిలకు దూరంగా ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంటుందని, ఆ సమయంలో అతనితో ఆమె కాకుండా మరెవరో ఉండి ఉండవచ్చునని సందేహం వ్యక్తం చేసింది. అస్కార్‌కు అమ్మాయిల పిచ్చి అని సమంత చెప్పకనే చెప్పింది. అస్కార్ గర్ళ్ ఫ్రెండ్స్ లిస్టులో రీవా, సమంతలతో పాటు జెన్నా ఎడ్కిన్స్, అనస్తాసియా కోజిసోవా, మెలిస్సా రోమ్, చానెల్లీ డుప్లెసిస్.. ఇలా పెద్ద జాబితానే ఉందట. అతనికి అమ్మాయిలతో పాటు బైక్, రేసు కార్ల పిచ్చి కూడా ఉందట. అతనికి ఫాస్ట్ కార్లంటేనే ఇష్టం. అస్కార్‌కు వేగంగా దూసుకెళ్లే కార్లంటే ఇష్టమని ట్రయినర్ జానీ బ్రూక్స్ తెలిపారు. కాగా ఫిబ్రవరి 14న ప్రియుడి చేతిలో మృతి చెందిన రీవా ప్రేమికుల దినోత్సవం రోజు ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. ప్రేమ కోసం ఈ రోజు మీరెలాంటి సర్ ప్రైజ్ చేయబోతున్నారని ట్వీట్ చేసింది. అదే రోజు పిస్టోరియస్‌ను ఆటపట్టించబోయి హత్య గావించబడింది.

Friday, 15 February 2013

వీణామాలిక్ ఓవర్ డోసు



 వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న పాకిస్థాన్‌ నటీమణి వీణామాలిక్. ఈమె 'డర్టీ పిక్చర్స్‌' కన్నడ వెర్షన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం బరువు పెరిగిన ఈమె తాజాగా బరువు తగ్గి తన తదుపరి చిత్రం ది సిటీ దట్ నెవర్ స్లీప్స్ చేస్తోంది. దాంతో తను బరువు తగ్గాననే విషయం ప్రపంచానికి, ముఖ్యంగా సినీ ప్రపచానికి తెలియచేసేందుకు ఫోటో షూట్ చేయించుకుని మీడియాకు వదిలింది. విద్యాబాలన్‌ హీరోయిన్ గా, ఏక్తాకపూర్‌ నిర్మించిన 'డర్టీ పిక్చర్స్‌'తో కన్నడ చిత్రం ప్రవేశం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కోసం ఎటువంటి వేషానికైనా రెడీ అంటుంది. ఎటువంటి వివాదానికైనా సై అంటుంది. ఇక దక్షిణ భారత కథానాయిక, ప్రముఖ నర్తకి సిల్క్‌ స్మిత జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్క్రిప్ట్‌ను వినగానే వీణామాలిక కన్నీరు కార్చానని చెప్తోంది. భారతీయ ఆచార వ్యవహారాల గురించి, సంప్రదాయాల గురించి, సిల్క్‌ స్మిత లైఫ్‌ స్కెచ్‌ను వీణామాలికకు త్రిశూల్‌ వివరించి ఆమెను ఎడ్యుకేట్‌ చేసి మరీ ఈ చిత్రంలో నటింపజేయడం విశేషం. వీణామాలిక నటించే సన్నివేశాలను పూర్తి చేసేందుకు త్రిశూల్‌కు 30 రోజులు లభించాయి,

Wednesday, 13 February 2013

గ్లామర్ తో కేక పుట్టిస్తున్న తెలుగమ్మాయి ?



 మహేష్ తో కలిసి హిట్  దూకుడు కొట్టిన సోనియా...ఈ  హాట్ లుక్ తో   ఆడియోన్స్స్ నీ ఆకట్టుకుంధీ  ... రోజు రోజుకీ పోటీ పెరుగుతోంది. కొత్త హీరోయిన్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతున్నారు. ఈ నేపధ్యంలో కొద్దిగా ఆమె కండిషన్స్ సడలించుకుని దర్శక,నిర్మాతలకు సహకరిస్తోంది.

Monday, 11 February 2013

అనుష్క‘రుద్రమదేవి’ లో రానా??


అనుష్క కు జోడీగా రానా ఎంపిక అయ్యాడు. దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘రుద్రమదేవి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రుద్రమదేవిగా అనుష్క నటిస్తుండగా, ఆమెకు జోడీగా దగ్గుబాటి రానా ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ ‘నిరవర్ద్యపురం (ఇప్పటి నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడితో రుద్రమదేవి వివాహం జరిగినట్లు చరిత్ర చెపుతుంది, ఈ యవరాజు పాత్రకు రానా ఖచ్చితంగా సరిపోతాడని’ చెప్పారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నటి అంజలి కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది.

త్రిష తొలి యాక్షన్ చిత్రం?

త్రిష కెరీయర్ లో ఇది తొలిసారి..!
ప్రసుత్త కాలంలో ఏ హీరోయిన్ కు లేని గొప్పతనాన్ని త్రిష దక్కించుకుంది. దాదాపుగా పది సంవత్సరాలుగా త్రిష కు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఎంత మంది కొత్త భామలు వచ్చి తమను నిరూపించుకున్నా త్రిష స్థానం పదిలంగానే ఉంది. అమెకు అవకాశాలు వస్తున్నాయి. యంగ్ హీరోల నుంచి, ప్రమఖ నిర్మాణ సంస్థల నుంచి ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ఇది త్రిష ఘనతగా చెప్పుకోవచ్చు. ఇటీవల ఏ హీరోయిన్ కూడా ఇంతకాలం పరిశ్రమలో నిలబడలేదు.  కాగా, త్రిష ప్రస్తుతం ‘రమ్’ అనే చిత్రంలో నటిస్తుంది. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష యాక్షన్ లేడీ గా కనిపించనుంది. ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో త్రిష నటిస్తుంది. త్రిష ఇప్పటి వరకూ యాక్షన్ సన్నివేశాల్లో నటించలేదు. ఇలా నటించడం త్రిష కెరీయర్ లో తొలిసారి అని చెప్పుకోవాలి. ఈ ‘రమ్’ చిత్రం కోసం త్రిషపై యాక్షన్ సన్నివేశాలను దుబాయ్, మస్కట్ లలో ఫైట్ మాస్టర్ విజయన్ నేతృత్వంలో చిత్రీకరించారు. కథానాయిక ప్రాధాన్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ లేడీ గా త్రిష నటన అందర్నీ ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ దీమాగా ఉంది. ఈ సినిమాలో నికీషా పటేల్, ఇషా చావ్లా, చార్మి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Friday, 8 February 2013

త్రిష పై పోలీస్ కేసు ?


ఎప్పుడూ తప్పతాగి ఒళ్లు తెలియకుండా వివాదాలకు కాలుదువ్వే త్రిష అందరికీ తెలుసే. పలు మార్లు స్నేహితులతో కలిసి తాగి తందనాలాడి వివాదాలు కొని తెచ్చుకుంది. ఎప్పుడూ పబ్బులు, క్లబ్బుల చుట్టూ తిరిగే త్రిష తాగడం అంటే తనకు ఎంత ఇష్టమే తనే తేల్చిచెప్పింది. తాను నటించే సినిమాలలో తాను మందు తాగి ఊగిపోయే సన్నివేశాలలో నటించడం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పేసింది. అంతటింతో ఆగకుండా తన సినిమాల్లో మందు కొట్టే సన్నివేశాలు లేకుంటే చిత్ర నిర్మాత, దర్శకులను అడిగి మరీ అలాంటి సన్నివేశాలు ఉండేలా చూసుకుంటానని చెప్పింది.
అయితే ఈ తాగుడు వెనుక ఓ సెంటిమెంటు ఉందని కూడా చెబుతోంది చెన్నయ్ బ్యూటీ. తాను కనుక మందు కొట్టే సన్నివేశంలో నటించానంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టంట. అందుకే వెంటబడి మరీ ఆ సన్నివేశాలు పెట్టాలని కోరుతుందట. తాజాగా విశాల్ సరసన త్రిష నటించిన తమిళ చిత్రం “సమర్” హిట్టయిందట. అందులో త్రిష మందు కొట్టే సన్నివేశాలు ఉన్నాయట. ఈ చిత్రం తెలుగులో వెంటాడు..వేటాడు పేరుతో విడుదలవుతుంది. సో ఇక నుండి త్రిష తాగి ఊగే సన్నివేశాలు మనకు బాగానే కనిపిస్తాయన్నమాట.
త్రిష చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు హిందూ మన్నాయి పార్టీ మండిపడుతోంది. . ఆ పార్టీ వారు ఆమెకు క్షమాపణ డిమాండ్ చేస్తూ ఉత్తరం రాసారు. ఇలాంటి సెలబ్రేటీలు చేసే వ్యాఖ్యాలు హిందూ స్త్రీలపై ప్రభావం చూపిస్తాయని, స్త్రీల త్రాగుడుని ఎంకరేజ్ చేస్తున్నట్లు ఉందని వారు నిరసన వ్యక్తం చేసారు. ఇక త్రిష నేటి తరం యువతులు మద్యం సేవించడం మీద మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నిస్తే 'ఇలాంటి వివాదాస్పద ప్రశ్నకు సమాధానం చెప్పలేను' అంటూ సమాధానం దాటవేసింది. . తొలుత నాకు 'వేటాడు వెంటాడు' కథ వినిపించనప్పుడు 'నటించాలా..?' అన్న ప్రశ్న ఎదురైంది. ఇందులో ఒక సందర్భంలో నాకు నెగటివ్‌ షేడ్స్‌ కనిపించాయి. ఆ స్క్రిప్ట్‌ చూడగానే వెంటనే అంగీకరించాలని అనుకున్నాను. గత చిత్రాలతో పోల్చితే ఇది సవాల్‌తో కూడుకున్నది. విశాల్‌ సరసన తొలిచిత్రమే కాసులవర్షం కురిపించడం ఆనందంగా ఉంది.

మిర్చిసినిమా లో వీనీపించనీ దేవేశ్రీ గొంతు ???

కొన్ని గీతాల్లోని దేవీ వాయిస్ ట్రాక్ ని మార్చారన్న ప్రచారం ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మీడియాలో ‘మిర్చి’ గీతాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రం ఆడియో మొదలైన దగ్గర్నుంచీ వివిధ టీవీ ఛానెళ్లలో దాదాపు అన్నిపాటలూ వినిపిస్తున్నాయి. వీటిల్లో అత్యధిక గీతాలకు దేవీశ్రీప్రసాద్ గొంతే వినిపించేది. అయితే, గడచిన మూడు నాలుగు రోజుల నుంచి దేవీ గొంతు మారిపోయింది. ఇంతవరకూ దేవీ పాడిన పాటలే వేరే గాయకులు ఆలపించిన క్లిప్స్ ప్రసారం అవుతున్నాయి. ఇంతకీ ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసా..? ‘మిర్చి’ ట్రైలర్ విడుదల అయ్యాక అన్ని గీతాలకూ దేవీ గొంతు సరిపోదు అన్న అభిప్రాయం చాలామందిలో కలిగింది. అది ఆనోటా ఈనోటా ఈ చిత్ర యూనిట్ కి చేరేసరికి ఇన్నాళ్లు పట్టింది. ముఖ్యంగా మెలడీల్లో దేవీ గొంతు బాలేదని చాలామంది ఘాటుగా విమర్సించారు.

Thursday, 7 February 2013

మస్కట్లో రమ్’ బ్యూటీలు.... ఫస్ట్‌లుక్

రంభ, ఊర్వశి, మేనక.... మూడు పేర్లను కలగలిపి ముగ్గురు భామల అందాలతో ప్రేక్షకులకు మత్తెక్కించే కాన్సెప్టుతో రూపొందుతున్న సినిమా రమ్(RUM). ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రంభగా త్రిష, మేనక పాత్రలో ఇషా చావ్లా, ఊర్వశి పాత్రకు నికీషా పటేల్ చేస్తుండగా... మరో ప్రత్యేక పాత్రలో హీరోయిన్ చార్మి నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ దుబాయ్, మస్కట్లో జరుగుతోంది. షూటింగు స్పాట్లో ఈ నలుగురు భామలు కలిసి కెమెరా ముందు ఇలా ఫోజు ఇచ్చారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడలో విడుదల కానుంది. నిర్మాతగా తెరంగ్రేటం చేసిన ఎంఎస్ రాజు ఆ మధ్య వరుస హిట్లు కొట్టి బాగా పాపులరైన సంగతి తెలిసిందే. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్లు ఈ మధ్య ఈ నిర్మాత వరుస ప్లాపులు చుట్టుముట్టాయి.

జూ ఎన్టీఆర్ కి పొగరు ఎక్కువే : పబ్లిసిటీ కోసం కాజోల్ తాపత్రయం



నాయక్ లో కాజోల్ కన్నా అమల కి ఎక్కువ పెరు రావటం తో  పబ్లిసిటీ కోసం కాజోల్ తాపత్రయం  పడుతుందీ......ఇంతకు ముందు కూడా ఫ్లాప్ సినిమా లు వచ్చినప్పుడు కాజల్ తన నడుము పైభాగాన్ని పూర్తి నగ్నంగా చూపించి బాలీవుడ్ కుర్రకారు మతి పోగొట్టింది.అలా ఎందుకు చేశావ్ అంటే... తన వక్షోజాలకు ఆచ్ఛాదన ఉందనీ, ఫోటోగ్రాఫర్ అత్యంత చాకచక్యంగా అక్కడేమీ లేనట్లుగా తీశాడని దబాయించింది. ఓ ఆంగ్ల అంతర్జాల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.... ‘నేను ఇష్టపడే తెలుగు హీరోల్లో జూ ఎన్టీఆర్ ఒకరు. అతడు మంచి నటుడే కాదు నిజాయితీ పరుడు. అదే విధంగా అతనికి పొగరుకి కాస్త ఎక్కువే. అహం భావం అనేది నిజాయితీలో ఓ భాగం. అందుకే అతనంటే నాకు ఇప్పటికీ ఇష్టం' అని వ్యాఖ్యానించింది కాజల్. మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని అడిగిన ప్రశ్నకు కాజల్ పై విధంగా సమాధానం ఇచ్చింది. అదే విధంగా తమిళంలో విజయ్‌ తన ఫేవరెట్‌గా పేర్కొంది. ఇంకా పలు విషయాలను వెల్లడిస్తూ తనకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు పరిశ్రమ అంటేనే ఇష్టమని, ఇక్కడ హీరోలతో పాటు హీరోయిన్లకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. కానీ తమిళ పరిశ్రమలో హీరోకి ఉన్నంత రెస్పెక్ట్ హీరోయిన్‌కి ఉండదు అని చెప్పుకొచ్చింది కాజల్.

సిటీ సెంటర్ మాల్ లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్

పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ బుధవారం నాడు హైదరాబాద్ లోని సిటీ సెంటర్ మాల్ లో జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సమంత, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Monday, 4 February 2013

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు జేమ్స్ బాండ్ సినిమా??

సీతమ్మ వాకిట్లో..’ విజయవంతంగా సాగుతున్న సందర్భంగా ఆదివారం నాడు మహేష్ బాబు విలేకరులతో మాట్లాడాడు. ఇందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ‘సీతమ్మ..’ చిత్రం చేస్తున్నప్పడే ఒక మంచి చిత్రంలోనే నటించిన అనుభూతి కలిగిందని చెప్పాడు. మంచి చిత్రంలో నటించాలనే ఉద్దేశ్యంతో వెంకేష్, తాను ఆ సినిమాలో నటించామని, సినిమాలపై దిల్ రాజుకు మంచి అవగాహన ఉందని, అందుకే అతనికి అన్ని విజయాలు దక్కుతున్నాయిని మహేష్ అన్నాడు. ‘ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నానని, సహజత్వంతో కూడిన ఈ చిత్ర కథ యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని, ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదని, జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని’ మహేష్ తెలిపాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘ఆగడు’ సినిమా మార్చి నెలలో ప్రారంభమౌతుందని, ఆ తరువాత క్రిష్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్ ల దర్శకత్వంలో సినిమాలు చేస్తానని మహేష్ తెలిపాడు. అలాగే, ఆ చిత్రాలు పూర్తియ్యాక రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని, కథ గురించే ఇది వరకే మాట్లాడుకున్నామని ప్రిన్స్ ప్రకటించాడు. ‘గతంలో మణిరత్నం గారు ‘పొన్నియన్ సెల్వన్’ చేద్దామన్నారు. కానీ బడ్జెట్ మరీ ఎక్కువవుతుందని, తర్వాత చేద్దామని చెప్పారు. భవిష్యత్తులో ఆ సినిమా కూడా ఉండవచ్చేమో’ అని మహేష్ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. కాగా, ‘విశ్వరూపం’ వివాదంపై మహేష్ స్పందించాడు. ఆ సినిమాపై వివాదం రేగడం దురదృష్టమని, కమల్ హాసన్ కు తాను వీరాభిమానినని, అంత పెద్ద నటుడు ఓ ఇంటర్వ్యూలో అలా మట్లాడటం చూస్తే బాధ కలిగిందని మహేష్ చెప్పాడు. తెలుగు సినిమాల మార్కెట్ ప్రస్తుతం చాలా బాగుందని, హిట్ సినిమా పడ్డ ప్రతిసారీ టార్గెట్ రేంజ్ మారిపోతూనే ఉందని, అయితే పైరసీని కంట్రోల్ చేయాలని అన్నాడు.

కేంద్ర సెన్సార్ బోర్డు తాజా నిర్ణయం వివాదాస్పదం

కేంద్ర సెన్సార్ బోర్డు తాజా నిర్ణయం వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల కాలంలో అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు దేశంలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వీటిని అరికట్టడానికి కేంద్రం ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా సెన్సార్ బోర్టు నిబంధనలు మార్పులు చేయనున్నారు. ఐటెం సాంగ్ ఉంటే ఆ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డు యోచిస్తుంది. ఈ నిర్ణయం సినీమా వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది. ఐటెం సాంగ్ ఉన్న ప్రతీ సాంగ్ కు A సర్టిఫికెట్ జారీ చేయడం అన్యాయమని, ఇలా చేస్తే సినిమా ప్రజాదరణకు, టీవిల్లో ప్రదర్శించడానికి ఇబ్బంది కలుగుతుందని చిత్రరంగానికి చెందిన ప్రముఖులు తమ వాదన వినిపిస్తున్నారు.

సన్నిలియోన్ బలుపు వ్యాఖ్యలు


‘రేప్ నేరం కాదు. అది... అనుకోకుండా జరిగే శృంగారం’ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి ..జిస్మ్-2 సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించిన ముద్దుగుమ్మ సన్నిలియోన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అత్యాచారం నేరం కాదని, అది అనుకోకుండా జరిగే శృంగారమని సన్నిలియోన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ‘రేప్ నేరం కాదు. అది... అనుకోకుండా జరిగే శృంగారం’ అని సన్నిలియోన్ ట్వీట్ చేసింది. అయితే తొందరగానే ఈ ముద్దుగుమ్మ తన తప్పును గ్రహించింది. కొద్దిసేపటికే తన ట్వీట్ తొలగించింది. కానీ వేల సంఖ్యలో ఉన్న ఆమె అభిమానులు ఈ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. దీంతో సన్ని వ్యాఖ్యలపై ఇప్పుడు అంతా మండి పడుతున్నారు.

Sunday, 3 February 2013

టెన్నిస్ స్టార్ సానియా సంచలనల బయోగ్రఫీ???


భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్వీయ చరిత్ర రాయాలని నిర్ణయించుకుంది. ఈ జీవిత చరిత్రలో స్కర్ట్‌ల అంశంపై "ఫత్వా" మొదలు పాకిస్థానీతో పెళ్లి వరకు ప్రతిదీ పొందుపరుచనుంది. క్రీడాకారిణిగా ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న సానియా మీర్జా తన మనోభావాలను స్వీయచరిత్ర ద్వారా వెల్లడించాలనుకుంటోంది.

కెరీర్‌కు సంబంధించిన విశేషాలు, అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగిన తీరు, సంఘర్షణ... తదితర అంశాలతో పాటు తరచూ ఎదుర్కొన్న వివాదాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావన ఉంటుందని సానియా వెల్లడించింది.

తన ఆటో బయోగ్రఫీకి సానియా మీర్జా ‘అగెనైస్ట్ ఆల్ ఆడ్స్...’ (అడ్డంకులను అధిగమించి) అనే పేరును ఖరారు చేసింది. దాదాపు పూర్తి కావచ్చిన ఈ పుస్తకం త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది.

సమంత 'బొడ్డు' లో ఎర్రటి రింగు ఎందుకు??


'జబర్‌దస్త్' ఆడియో రిలీజ్ ఫంక్షన్లో సమంత ధరించిన పలుచటి చీరలోంచి ఆమె బొడ్డుకు ఎర్రటి రింగు ఒకటి వేలాడుతూ కనిపించడాన్ని ఫోటోగ్రాఫర్లు క్యాచ్ చేశారు. ఇదిలావుంటే సమంత తన నాభీ ప్రదర్శనను ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా చేస్తోందంటున్నారు.

ఇప్పటికే జబర్‌దస్త్ స్టిల్స్‌లో ఆమె నాభీ ప్రదర్శనతో టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఇదిలావుండగానే ఆడియోలో నేరుగా పలుచటి శారీలో బొడ్డందాలను చూపిస్తూ వచ్చేసరికి దీనిపై అక్కడున్నవారే గుసగుసలుగా మాట్లాడుకోవడం కనిపించింది.

ఇకపోతే సమంత ఇలా గ్లామర్ ప్రదర్శనలను చూపిస్తూ ఆడియో ఫంక్షన్లకు రావడం మామూలే. ఆమధ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియోకు కూడా ఇలాగే ఆమె నడుము అందాలను చూపుతూ కూచోవడం చర్చకు తావిచ్చింది. ఐతే సమంత మాత్రం అవేమీ పట్టించుకునే దశలో లేదంటున్నారు. దీని వెనుక కారణం ఏంటయా.. అంటే ఆమె ఓ కుర్ర హీరో ప్రేమలో పీకల్లోతు పడినట్లు చెప్పుకుంటున్నారు.

Saturday, 2 February 2013

హీరోయిన్ మినీషా లాంబ బ్రెస్ట్‌ను టచ్ చేసిన హీరో ??

అర్షద్ వర్సీ, వివేక్ ఒబెరాయ్, సంజయ్ దత్, మినీషా లాంబా తదితరులు ప్రధాన పాత్ర దారులుగా రూపొందుతున్న చిత్రం ‘జిల్లా గజియాబాద్'. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వివాదాస్పద సీన్ ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. ఇందులో హీరో అర్షన్ వర్సీ...హీరోయిన్ మినీషా లాంబ రొమ్ము భాగాన్ని చేత్తో టచ్ చేసిన సన్ని వేశానికి సంబంధించిన ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆనంద్ కుమార్ ఈ సీన్ గురించి, దాని ప్రాధాన్యత, సినిమాకు అలాంటి సీన్ ఎందుకు? అనే విషయాలను ముందుగా వివరించి ఇద్దరినీ ఒప్పించాడు. అయితే ఆ సీన్ షూట్ చేసే వరకు యూనిట్ సభ్యులెవరికీ అలాంటి సీన్ ఉంటుందనే విషయం తెలియదు. ఉన్నట్టుండి అర్షన్ వర్సీ మినీషా లాంబ రొమ్ములపై చేయి వేయడంతో యూనిట్ సభ్యులంతా షాకయ్యారు. కొందరు ఆయన కావాలనే ఇలాంటి పని చేసాడని అనుమాన పడ్డారు.