Friday, 28 September 2012

బ్రౌజింగ్ చేసి డబ్బు సంపాదించడం ఎలా..?

టెక్నాలజీ గెయింట్ గూగుల్ సెర్చ్ ఇంజన్‌ని ఉపయోగిస్తున్నారా.. ఐతే గూగుల్ మీకు త్వరలో డబ్బులు చెల్లిస్తుంది.. తీసుకునేందుకు సిద్దంగా ఉండండి. గూగుల్ కొత్తగా ‘స్క్రీన్‌వైజ్’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గూగుల్ $25( సుమారు Rs 1250) అమెజాన్.కామ్ గిప్ట్ కార్డ్స్‌ని యూజర్స్‌కి అందించనుంది. సెర్చ్ ఇంజన్ ద్వారా యూజర్స్  వేరు వేరు వెబ్ సైట్స్‌కి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకోవడం వల్ల ఈ గిప్ట్ కార్డ్స్ లభించనున్నాయి.
గూగుల్ ప్రకారం  ప్రజలు ఇంటర్నెట్ వాడకం మరియు సాధారణ దైనందిన పోకడలు గురించి మరింత తెలుసునే భాగంగా ఈ కార్యక్రమానికి గూగుల్ శ్రీకారం చుట్టిందని సమాచారం. ఈ స్క్రీన్‌వైజ్ కార్యక్రమంలో పాల్గోనదలచిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు.. వారి యొక్క వెబ్ బ్రౌజర్స్‌లో గూగుల్ పొడిగింపులను నిక్షిప్తం చేసుకోవాలి. ఇలా యూజర్స్ గూగుల్ పొడిగింపులను నిక్షిప్తం చేసుకోవడం వల్ల యూజర్స్ ఏమేమి బ్రౌజింగ్ చేస్తున్నారో గూగుల్ ప్రతినిధులు గూగుల్ ట్రెండ్స్ ద్వారా తెలుసుకోవడం ఈజీ.
ఎవరైతే యూజర్స్ గూగుల్ స్క్రీన్‌వైజ్‌లో  రిజస్టర్ అవుతారో వారికి $5(సుమారు Rs 250)  అమెజాన్.కామ్ గిప్ట్ కార్డు లభిస్తుంది. మూడు నెలలు పాటు జరగనున్న ఈ ప్రోగ్రామ్‌ని సక్సెస్ పుల్‌గా పూర్తి చేసిన యూజర్స్‌కు గిప్ట్ కార్డ్స్ వస్తూనే ఉంటాయి. దీని ద్వారా ఇందులో పాల్గోనే పాల్గోనదారులకు మొత్తం  $25(సుమారు Rs 1250) లను సొంతం చేసుకోనున్నారు. ఒక్కసారి ఈ స్క్రీన్‌వైజ్ లో రిజస్టర్ ఐతే మూడు నెలలు పాటు మీరు చేసే బ్రౌజింగ్ కార్యకలాపాలన్నీ గూగుల్ ట్రెండ్స్ ద్వారా మానిటర్ చేయబడతాయనే విషయాన్ని యూజర్స్ గుర్తించుకోవాలి.

కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం ఆడియో ఫంక్షన్ జరపక పోవటానికి కారణం ?

‘‘ఈ మధ్య ఏ ఆడియో ఫంక్షన్ చూసినా ఒకే విధంగా వుంటున్నాయి. పొగడ్తలు .. పొగడ్తలు .. పొగడ్తలు .. పొగడ్తలు .. హీరో ను పొగడక పొతే ఫ్యాన్స్ గెస్ట్ లను మాట్లాడానిక పోవడం. ఫ్యాన్స్ ను ఏమి అనలేక వాళ్ళ చేష్టలను అతిధులు భారంగా భరించడం. ఆ విధంగా ఆలోచిస్తే కెమెరామెన్ గంగతో రాంబాబు ఆడియో ఫంక్షన్ అవసరమా అనిపిస్తుంది. ‘ ఆడియో ఫంక్షన్ వలన సినిమాకు మంచి పబ్లిసిటి కాబట్టి, సినిమాకు ఆడియో ఫంక్షన్ చాలా అవసరం. సినిమాపై హిరో మనసులోని మాటలు వినవచ్చు '... కాని ఈ ప్రోసస్ అంతా రొటీన్ అయిపోయింది. బిజెనెస్ మెన్ ఆడియో ఫంక్షన్లో పూరి జగన్నాథ్ మహేష్ బాబు ను ర్యాగింగ్ చేసినట్టు, పవన్ కళ్యాణ్ ను కూడా పూరి జగన్నాథ్ ప్రశ్నలతో ముంచెత్తి పవన్ కళ్యాణ్ పై తెలుగు ప్రేక్షకులకు వున్న డౌట్స్ అన్ని తీరిస్తే బాగుండును. కానీ మహేష్ బాబుతో ఉన్నంత చనువు పవన్ కళ్యాణ్ తో వుండి వుండదు.'' అంటూ ఆడియో ఫంక్షన్ లేక పోవడాన్ని కొందరు పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వెబ్ పేజీలో సమర్థించుకుంటున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఆడియో(సెప్టెంబర్ 26) నేరుగా . ఈఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సాదీ సీదాగా నిర్వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో సీడీలను మార్కెట్‌లోకి విడుదల చేసారు. మణిశర్మ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు అభిమానులును బాగా అలరిస్తున్నాయని సమాచారం. మాస్ కోసం రెడీ చేసిన ఐటం సాంగ్ ...గ్యారెంటీగా ధియోటర్స్ లో జనం లేచి డాన్స్ చేస్తారంటున్నారు. చిత్రంలోని పాటలను భాస్కరభట్ల సింగిల్ కార్డుతో రాసారు. మధ్య ఆడియో ఫంక్షన్ రోటీన్ అయిపోయాయి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పేజీ ఓ పోస్టు చేసింది.

Monday, 24 September 2012

ఆస్కార్ కి బర్ఫీ సినిమా ఎంపిక..

 ఇలియానా నటించిన తొలి హిందీ సినిమా 'బర్ఫీ'. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డుల బరిలోకి భారతదేశం తరఫున చిత్రం దిగబోతోంది. 2012 సంవత్సరానికిగానూ 'బర్ఫీ' చిత్రాన్ని ఎంపిక చేసినట్టు శనివారం రాత్రి ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆస్కార్‌ జ్యూరీ ఛైర్‌పర్సన్‌ మంజు బోరా ఈ విషయం తెలియచేసారు. ఆస్కార్ అవార్డ్స్ విభాగంలో ‘ఉత్తమ విదేశీ చిత్రం' విభాగానికి సంబంధించిన నామినేషన్ కోసం మన భారతదేశం నుంచి ఒక సినిమాని ఎంపిక చేసింది ఎఫ్‌ఎఫ్‌ఐ. వివిధ భారత భాషల్లో రూపొందిన దాదాపు 20 చిత్రాలను వీక్షించారు.మంజు బోరా మాట్లాడుతూ ''మొత్తం 20 ఎంట్రీలు వచ్చాయి. వాటిలో 'బర్ఫీ' చిత్రాన్ని ఎంపిక చేశాం. మానవ సంబంధాలకు ప్రాధాన్యమున్న చిత్రమిది. మన దేశం స్థితిగతుల్ని కూడా ప్రతిబింబించేలా తెరకెక్కించారు. అందుకే ఈ సినిమాని ఎంపిక చేశాము. మేం చూసిన అన్ని చిత్రాలు బాగున్నాయి. కానీ అకాడమీ అవార్డ్స్ కమిటీ నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ మేరకు ‘బర్ఫీ'ని ఎంపిక చేశాం. ఆస్కార్ నామినేషన్‌కు పంపించడానికి సినిమా కథ, నాణ్యత ముఖ్యం. ‘బర్ఫీ'లో ఇవి మెండుగా ఉన్నాయి. మానవీయ విలువలను అద్భుతంగా చూపించిన చిత్రం ఇది'' అన్నారు.ఎప్పుడూ కూడా హిందీ సినిమాలకే అవకాశాలిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ''సినిమాలో ఉన్న విషయం, విలువల్నిబట్టే ఎంపిక జరుగుతుంది. అంతే కానీ భాషతో సం బంధమేమీ లేదు'' అన్నారు. మన సినిమాలు ఆస్కార్‌లో చివరి వరకూ నిలవలేకపోతున్నాయి కదా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ''సినిమాని ఎంపిక చేయడం వరకే మా బాధ్యత. అక్కడ ఆస్కార్‌ వేదికపైకి చేరడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తే బాగుంటుంద''న్నారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులు పాల్గొన్నారు                                                                                                                                                                                                       post by venkatesh.gurrala

cameraman ganga tho rambabu audio tracks list ...                                                                                                                               పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూర్య దేవర రాధాకృష్ణ సమర్పణలో యూనివర్శల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు'. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలోని సెవెన్ ఎకర్స్ లో నిర్మించిన భారీ సెట్స్‌లో జరుగుతోంది. తాజాగా ఈచిత్రం ఆడియో ట్రాక్ లిస్టు బయటకు వచ్చింది. ఎలాంటి ఆడియో వేడక లేకుండా నేరుగా సినిమా పాటలను మార్కెట్లోకి విడుదల కానున్నాయి.
ఆడియో ట్రాక్ లిస్ట్
1. థీమ్ సాంగ్
పాడినవారు: హేమ చంద్ర, కారుణ్య, నరేంద్ర
2. పిల్లని చూస్తే..
పాడినవారు: కారుణ్య, చిత్ర
3. జరమొచ్చింది
పాడినవారు: ఖుషి మురళి, శ్రావణ భార్గవి
4. ఎక్స్‌ట్రార్డరనీ
పాడినవారు: హేమ చంద్ర
5. మెలికల్
పాడినవారు: గీతా మాధురి, నరేంద్ర
6. తలదించుకు...
పాడినవారు: కారుణ్య, హేమచంద్ర, శ్రీకృష్ణ, నరేంద్ర...............................                                                              post by venkatesh.gurrala

Friday, 21 September 2012

వారంలో సింగ్ కేబినెట్లోకి చిరంజీవి?

తృణమూల్ కాంగ్రెసు పార్టీ మన్మోహన్ సింగ్ మంత్రివర్గం నుండి నిష్క్రమిస్తున్న నేపథ్యంలో వారం రోజుల్లో పునర్వవస్థీకరించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం, వీరభద్ర సింగ్ వంటి వారు అవినీతి ఆరోపణలతో కేబినెట్ నుండి ఇప్పటికే బయటకు వెళ్లిపోయారు. తాజాగా టిఎంసి మంత్రులు కూడా గుడ్ బై చెప్పనున్నారు. శుక్రవారం ఏ సమయంలోనైనా వారు తమ రాజీనామాలు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో ఖచ్చితంగా మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది.ఈసారి మార్పులు చేర్పులు భారీగానే ఉండే అవకాశముంది. రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ, ఆర్థికమంత్రి చిదంబరం, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేల స్థానం పదిలమే అయినప్పటికీ చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగినా జరగవచ్చంటున్నారు. త్వరలో గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు, లోకసభ ఎన్నికల సన్నద్ధత కోసం పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.
ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మరికొందరిని మంత్రివర్గం నుండి తొలగించి రాష్ట్రాల బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి సహాయ శాఖ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయ. ఒకటికి మించి శాఖలు నిర్వహిస్తున్న పలువురు మంత్రులను అదనపు బాధ్యతల నుండి తప్పించి ఇతరులకు అప్పగించే అవకాశాలున్నాయి.
2జి కుంభకోణంలో అరెస్టైన రాజా రాజీనామా తర్వాత ఆ శాఖను సిబాల్ చూస్తున్నారు. దయానిధి మారన్ శాఖ ఖాళీగా ఉంది. టిఎంసికి చెందిన ముకుల్ రాయ్ రైల్వే మంత్రిగా రాజీనామా చేయనున్న నేపథ్యంలో ఆ శాఖను కాంగ్రెసు తన దగ్గరే ఉంచుకుంటుంది. .

Thursday, 20 September 2012

పవన్ కళ్యాణ్‌తో   శేఖర్ కమ్ముల

సినిమా??

 దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా మేకింగ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్నాడు. ఇటీవల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన శేఖర్ కమ్ముల అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని స్పష్టం చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...‘నా ఫేవరెట్ హీరో చిరంజీవి. పవన్ కళ్యాణ్ నాకు అందనంత ఎత్తులో ఉన్నారు. పవన్ అంటే నాకు ఎంతో ఇష్టం అతనితో సినిమా చేయాలని ఉంది. నాకు అవకాశం వస్తే ఎప్పటికైనా తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా' అని వెల్లడించారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇటీవల విడుదలైన ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా కేవలం క్లాస్ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునే విధంగా ఉంది. అర్భన్ ఆడియన్స్ మాత్రమే ఈచిత్రాన్ని ఇష్ట పడతున్నారు. మాస్ మసాలా ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు ఈచిత్రాన్ని అంతగా ఇష్ట పడటం లేదు. శేఖర్ కమ్ముల త్వరలో నాగార్జున తనయుడు అఖిల్‌ను పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమన్నా హీరోయిన్. డీవీవీ దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులో ఆడియో అక్టోబర్ నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Monday, 17 September 2012

   ఆస్కార్ అవార్డ్స్ కి మన తెలుగు చిత్రం ఈగ                                                                                          స్కార్ వార్డ్స్ కి మన తెలుగు చిత్రం ఈగ వేల్లబోతుంది .. ఇండియా  తరుపున మొత్తం ౧౨  ఛిత్రలూ పోటి లో ఉన్నాయి. తెలుగు నుండీ ఈగ  పోటి పడుతుంది  ..౧౨ నుండి ఒకటి సెలెక్ట్ ఆయీ  ఇండియా తరుపున ఆస్కార్ కివెళుతుంది ...   news compesed writen by venkatesh.gurrala

ఫోన్5కు ఛాలెంజ్‌గా నిలిచిన స్మార్ట్‌ఫోన్‌లు?

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, http://economictimes.indiatimes.com/photo/12997269.cms

గెలాక్సీ ఎస్3 స్పెసిఫికేషన్‌లు:
4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ కు అప్ డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 16జీబి మెమరీ వేరియంట్ ధర రూ.38400, 32జీబి మెమెరీ వేరియంట్ ధర రూ.41,500.

నోకియా లూమియా 920http://www.thinkdigit.com/FCKeditor/uploads/nokia-lumia-920-and-820-headset.jpg

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీ, వై-ఫై, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (నోకియా ప్యూర్ వ్యూ టెక్నాలజీ), నోకియా సిటీ‌లెన్స్ అప్లికేషన్, 1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోయూఎస్బీ పోర్ట్, శక్తివంతమైన 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్యఐ వైర్‌లెస్ పవర్ స్టాండర్డ్. లూమియా 920 ఎల్లో, రెడ్, వైట్, గ్రే, బ్లా వంటి వైబ్రెండ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఫోన్‌కు సంబంధించి పూర్తిస్థాయి స్పెసిఫికేషన్‌లతో పాటు ధర వివరాలు తెలియాల్సి ఉంది. భారత్ మార్కెట్లో లూమియా 920 నవంబర్ లేదా డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. news composed by venkatesh.gurrala

వైయస్ జగన్‌కు నారా లోకేష్ పోటీ ఇస్తారా?


 తెలుగుదేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ క్రియాశీలక పాత్ర పోషించడం దాదాపుగా ఖరారైంది. ఆయన ప్రజల్లోకి వెళ్లి తన సత్తా చాటాలనే ఉద్దేశంతోనే ఉన్నారు.  లోకేష్ రాజకీయ రంగ ప్రవేశానికి మామ, స్వర్గీయ ఎన్టీ రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు భావిస్తున్నారు.
నారా లోకేష్‌కు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ ఆటంకాలు కూడా తొలగిపోయినట్లు భావిస్తున్నారు. దీంతో నారా లోకేష్ అంతర్గత సమస్యలను పక్కన పెట్టేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ముందుకు దూకబోతున్నట్లు చెబుతున్నారు.
వైయస్ జగన్ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. ఒక రకంగా, ఆ రెండు పార్టీలకు ఆయన కొరకరాని కొయ్యగానే తయారయ్యారు. కాంగ్రెసు రాజకీయాలు కూడా వైయస్ జగన్ చుట్టే తిరుగుతున్నాయి. ఆయనకు కళ్లెం వేయడం ఎలాగో తెలియక కాంగ్రెసు అధిష్టానం సైతం సతమవుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా జగన్ రాజకీయ ప్రాబల్యానికి ఉక్కిరి బిక్కిరి అవుతుందనే చెప్పాలి. ఈ స్థితిలో నారా లోకేష్‌ జగన్‌కు పోటీ ఇస్తారా అనే చర్చ సాగుతోంది.
నారా లోకేష్ ద్వారా యువత వైయస్ జగన్ వైపు వెళ్లకుండా నిరోధించాలనే ప్రయత్నాలకు తెలుగుదేశం పార్టీ తెర తీసినట్లు భావిస్తున్నారు. జగన్ తన వ్యవస్థను తాను ఏర్పాటు చేసుకోగా, ఇది వరకే ఏర్పాటైన వ్యవస్థ లోకేష్‌కు ఉంది. పైగా, వ్యూహరచనలో దిట్ట అయిన చంద్రబాబు అండదండలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెసులో ఏది చేయాలన్నా జగన్ తన మీద తానే ఆధారపడాల్సి న పరిస్థితి. పైగా జైలులో ఉన్నారు. ఈ స్థితిలో జగన్‌ కన్నా నారా లోకేష్‌కు అదనపు సౌకర్యాలున్నాయి.
అయితే, వైయస్ జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని సొంతం చేసుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు జగన్‌కే ప్రజా మద్దతును సమకూర్చి పెడుతున్నాయి. నారా లోకేష్‌కు స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వం అంది వస్తుందనేది సందేహమే. చంద్రబాబు వారసత్వం ఆయనకు లభిస్తుంది గానీ తాత ఎన్టీఆర్ వారసత్వం లభించే అవకాశాలు లేవు. ఏమైనా, నారా లోకేష్ జగన్‌ను ఏ విధంగా ఢీకొంటారనేది వేచి చూడాల్సిందే.

Sunday, 16 September 2012

  చంద్రబాబుది డ్రామా యాత్ర: రోజా :      


 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళ నేత, ప్రముఖ నటి రోజా ఆదివారం మరోసారి విరుచుకు పడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించారని, ఆ సమయంలో వర్షాలు పడక రైతులు తీవ్ర కరువు కాటకాలు ఎదుర్కొన్నారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రజా సమస్యల కోసం అంటూ పాదయాత్ర చేస్తే పొలాలు ఇప్పుడు బీడుగా మారిపోతాయని విమర్శించారు.
కాంగ్రెసుతో జత కట్టాల్సిన అవసరం తమకు ఎంతమాత్రమూ లేదని రోజా అన్నారు. తమ పార్టీని, తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకనే తెలుగుదేశం పార్టీయే కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు అయిందన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కయ్యాయని, అందుకే ఆ పార్టీలు రెండు కొన్ని నియోజకవర్గాలలో డిపాజిట్లు దక్కించుకున్నాయన్నారు. కాంగ్రెసుతో జతకట్టిన టిడిపి తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
కాగా అంతకుముందు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ హైదరాబాదులో మాట్లాడుతూ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తమ పార్టీని విలీనం చేయాల్సిన అవసరం మాకుందా అని ఆమె మీడియాను ప్రశ్నించారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిశ్చితార్థం అయిపోయిందని, త్వరలో పెళ్లి జరగనుందని వ్యాఖ్యానించిన తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలను మీడియా విజయమ్మను ప్రశ్నించింది.
అందుకు ఆమె.. తమ పార్టీకి విలీనం అవసరమా అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఉప ఎన్నికలలో తమ పార్టీని ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించారని, అలాంటి ప్రజలను తాము మోసం చేయమన్నారు. రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న తమ పార్టీకి విలీనం అవసరమని మీరు భావిస్తున్నారా అని, ఏ ఒక్కరైనా విలీనం అవసరమని చెప్పగలరా అని విజయమ్మ అన్నారు. తన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం విలీనం అవుతుందన్న వ్యాఖ్యలను కూడా ఆమె కొట్టిపారేశారు. జగన్ జైలుకు వెళ్లి తొంబై రోజులు దాటిందని, అలాంటప్పుడు న్యాయపరంగా బెయిల్ వస్తుందన్నారు.

Saturday, 15 September 2012


చిరంజీవి నిరీక్షణ : ఎందుకు ఈ పరిస్తితి



ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చేరే విషయంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ఏ విషయమూ చెప్పలేదు. దీంతో కేంద్ర మంత్రివర్గంలో చేరడానికి రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నిరీక్షించక తప్పడం లేదు. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసే సమయంలో సోనియా గాంధీ కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకుంటామని చిరంజీవికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రాజ్యసభకు ఎంపిక చేయడం పూర్తయినప్పటికీ మంత్రివర్గంలో చేర్చుకునే విషయం మాత్రం తేలడం లేదు.
కేంద్ర మంత్రివర్గంలో చేరడానికి రాహుల్ గాంధీ ఇంకా ఎలాంటి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. నిజానికి మంత్రివర్గ విస్తరణ సెప్టెంబర్ మొదటివారంలోనే జరుగుతుందని భావించారు. రాహుల్ నిర్ణయం కోసమే ఇన్నాళ్లూ వేచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం రాహుల్ నిర్ణయంతో ప్రమేయం లేకుండా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది.
శుక్రవారం జరిగే కోర్ కమిటీ సమావేశంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై తుది మెరుగులు దిద్దుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వారం రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చిరంజీవికి ఈసారి విస్తరణలో బెర్త్ ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చిరుతో పాటు రాష్ట్రం నుంచి మరో ఇద్దరికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేటు కోసం రాష్ట్రం నుంచి పలువురు పోటీ పడుతున్నారు.
సర్వే సత్యనారాయణ తనకు మంత్రి పదవి వస్తుందని గతంలో ఓసారి చెప్పారు. కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివ రావు వంటివాళ్లు కూడా చాలా కాలంగా మంత్రి పదవి కోసం వేచి చూస్తున్నారు. అయితే, వారికి అవకాశం వస్తుందా, లేదా అనేది చెప్పలేని స్థితే ఉంది. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వివిధ కారణాలతో పలు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాగా, ఎస్ జైపాల్ రెడ్డిని, ఎస్ఎం కృష్ణలను మంత్రి పదవుల నుంచి తప్పించి రాష్ట్రాలకు పంపిస్తారని కూడా ఇటీవల ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి వీలుగా ఎస్ జైపాల్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంపించవచ్చునని ప్రచారం సాగింది.

apple5 phone release in September 2012..

Design and Specifications
Apple iPhone 5 has a 4.0" LED backlit IPS TFT capacitive touch screen with pixel density of 326ppi. The phone runs iOS 6 operating system with a A6 processor and PowerVR SGX543MP4 GPU with 1GB RAM. The phone has dimensions of 123.8 x 58.6 x 7.6 mm making it 18% thinner than iPhone 4S because of its in-cell touch screen technology. The phone also weighs just 112grams, making it 20% lighter than the iPhone 4S.
Camera and Multimedia
The phone has an 8MP camera with a backlit CMOS image sensor. The camera has great features such as geo tagging, auto focus, touch focus, Panorama LED flash and face detection. There is a 1MP front facing camera with HD Facetime support for both Wifi and 3G/4G networks.
Connectivity and Features
Apple iPhone 5 is expected to run on quad core 2G and 3G networks as well as 4G LTE networks through Nano SIM. The phone supports internet access through GPRS, EDGE, 3G, Wifi and 4G LTE. The phone also has Bluetooth 4.0 , NFC and a 19 pin dock connector for connectivity and power. The iPhone 5 will feature an updated Siri voice assistant service that follows natural language commands and dictation. The phone has reworked iMap feature as well, moving away from the Google Maps that were being used before.
Battery and Storage
The phone is expected to have similar battery life as iPhone 4S of 8 hours in 2G and 3G. The phone will be available in variants of 16, 32 and 64 GB internal memory.

Tuesday, 4 September 2012

పధ్నాలుగేళ్ల తర్వాత....శ్రీదేవి


ఒకటిన్నర దశాబ్దం వరకు దక్షిణం, ఉత్తరం అని తేడా లేకుండా యావత్ భారతావని వెండితెరపై అతిలోక సుందరిగా శ్రీదేవి తిరుగులేని ఇమేజ్‌ సంపాదించుకుంది. అదంతా ఒకప్పుడు. అయినా ఇప్పటికీ శ్రీదేవి అందంతో పోల్చదగ్గ హీరోయిన్లు లేరని అంటుంటారు సినీ పండితులు. పధ్నాలుగేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై శ్రీదేవి `ఇంగ్లీష్‌ వింగ్లీష్‌` అనే హిందీ చిత్రం ద్వారా పునః ప్రవేశం చేయనుంది. అమితాబ్‌తో `చినీ కమ్` `పా` చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్.బాల్కీ సతీమణి గౌరీషిండే ఈ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఫ్రెంచ్ నటుడు మెహ్ది నెబో, అదిల్ హుస్సేన్, ప్రియా ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించనున్న ఈ చిత్రం సెప్టెంబర్ మాసంలో విడుదలకానుంది. శ్రీదేవిలో ఏ మాత్రం గ్లామర్‌ తగ్గలేదంటూ ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ చూసిన అభిమానులు ముచ్చట పడుతున్నారు. ఆ మధ్య ఓ తెలుగు సినిమా ఫంక్షన్‌కి హాజరైన శ్రీదేవి బొద్దుగా కన్పించిన విషయం విదితమే. ఆ తర్వాత చాలా కష్టపడి, శరీరాన్ని స్లిమ్‌గా మార్చుకుని ఈ చిత్రంలో కన్పించింది శ్రీదేవి. మరి శ్రీదేవి `ఇంగ్లీష్‌ వింగ్లీష్‌` సినిమాతో అభిమానులకు ఎలా కనువిందు చేయనుందో చూడాలి మరి!

టాలీవుడ్‌లో 30% వాటా కోరిన తెలంగాణ బోర్డు

ఇటీవల కాలంలో రెండు సమ్మెలు, మరియు వరస ఫ్లాపులతో సతమతమవుతున్న తెలుగు చిత్రపరిశ్రమకు త్వరలో మరో ఎదురు దెబ్బ తగలనుంది, అదీ తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రూపంలో. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ త్వరలో తెలంగాణా ప్రాంతములోని అన్ని నిర్మాణ, పంపిణీ సంస్థలకు మరియు థియేటర్ యాజమాన్యాలకు లేఖలను సంధించనుంది. ఆ లేఖల సారాంశము, తెలంగాణా ప్రాంతమునకు చెందిన వారకు 30 నుంచి 40 శాతము ఉద్యోగావకాశములు కల్పించమని. అంటే 20 మంది పనిచేయుచున్న ఒక నిర్మాణ సంస్థలో కనీసము 7 నుంచి 8 మంది తెలంగాణా వారై వుండాలి.

"మేము తెలంగాణా ప్రాంతములోని అన్ని నిర్మాణ సంస్థలను, పంపిణీ సంస్థలను, మరియు అన్ని థియేటర్ యాజమాన్యాలను తెలంగాణా ప్రాంతీయులకు ఉపాధి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. 1985 తర్వాత ప్రారంభించబడిన అన్ని సంస్థలు ఇతర ప్రాంతీయులను దిగుమతి చేసుకున్నాయి కాబట్టే ఇపుడు తెలంగాణా ప్రాంతీయులకు అధిక ప్రాతినిధ్యం కల్పించాల్సిందిగా కోరడమైనది" అని తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శ్రీ విజయేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణేతర ఎగ్జిబీటర్ల వ్యతిరేక ఉద్యమం గత కొద్ది కాలంగా ఊపందుకొంటున్నది. థియేటర్లను లీజుకు తీసుకున్న వారిలో 70 నుంచి 80 శాతం మంది తమ లీజులను పొడిగించుకొనేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి కారణం మాత్రం ఖచ్చితంగా వేర్పాటు వాదుల ఆగ్రహావేశాలకు బలి కాకూడదనే. "ఒక వేళ మే-జూన్ నెలలో ప్రత్యేక తెలంగాణాను ప్రకటిస్తే, తీవ్రంగా నస్టపోయేది మేమే. ఎటువంటి రిస్క్ తీసుకోము. లీజులను పొడిగించటం కంటే వేచి చూడడం ఉత్తమం" అని అన్నారు తెలంగాణా ప్రాంతంలో 40 పైన థియేటర్లను లీజుకు తీసుకున్న ఒకతను.

శ్రీ విజయేందర్ రెడ్డి దీనికి మరో విధంగా స్పందించారు, "అధిక నస్టాలతో 60 నుంచి 70 థియేటర్లు మూత పడిన మాట వాస్తవమే కాని మా ఫోకస్ అంతా పెద్ద పెద్ద నిర్మాణ మరియు పంపిణీ సంస్థల పైనే, ఒక్కొక్క ఆఫీసులో కనీసం 20 నుంచి 25 మందిదాకా పనిచేస్తుంటారు" అని అన్నారు. డాన్సర్లు, ఫైటర్లు, లాంటి నైపుణ్యముతో కూడిన ఉద్యోగాలపై ఎటువంటి ప్రభావము వుండబోదని ముక్తాయించారు.

డెక్కన్ క్రానికల్ సౌజన్యంతో

2011-2012 సొమ్ము రూ.200 కోట్లు మటాష్..

తీన్‌మారూ.. తీన్‌మారూ.. ఎందుకు ఆడలేదు. శక్తీ..శక్తీ.. ఎందుకు నీరసించావ్.. కొమరం పులీ.. కొమరం పులీ.. ఎందుకు గాండ్రించలేదు.. ఇలా క్వొశ్చన్లు అడుక్కుంటూ పోవడం కన్నా.. పర్‌ఫెక్టూ..పర్‌ఫెక్టూ ఎందుకు జనానికి నచ్చావ్..అని ఒక్క ప్రశ్న అడగడం సులువేమో. కోట్ల నోట్ల వ్యాపారంపై ఆశలు, బినామీ లేదా జీతాల ప్రొడ్యూసర్లతో పనులు కానివ్వడం తప్ప, కాసింత ఆలోచన కానీ, జనానికి ఏం కావాలో అన్న అంచనాలు కానీ అస్సలు లేకపోతే ఇలాగే వుంటుందని ఎవరన్నా అంటే ‘అవునుగావోల్ను..’ అని అనుకోవచ్చు. అప్పనంగా వచ్చినవో, లక్షల వడ్డీలు చెల్లించి తెచ్చిన కోట్లు జనాలు సినిమాలు చూడక, నిర్మాతలు చూస్తూ చూస్తూ వుండగానే రీళ్లు మింగేస్తున్నాయి. తెలుగు సినిమా రేంజ్ భయంకరంగా పెరిగిపోయింది. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో మన జనాలు పెరగడంతో ఓవర్‌సీస్ ఆదాయం పెరిగింది. అలాగే మరో పక్క శాటిలైట్ హక్కుల నుంచి వచ్చే సొమ్ము, ఇది కాక వీలయినంత హైప్ తీసుకువచ్చి, థియేటర్లు బ్లాక్ చేసి, జనానికి సినిమా సంగతి తెలిసే లోగానే డబ్బులు నొల్లేసుకోవచ్చన్న చెత్త అయిడియాలే తప్ప, డబ్బే కాకుండా వొళ్లు కూడా దగ్గర పెట్టుకుని సినిమా తీద్దామన్న మంచి ఆలోచన చేసే సమయం మన బినామీ నిర్మాతలకు లేకుండా పోతోంది. దర్శకులది కూడా నిర్మాతల వ్యవహారంలాగే తయారైంది. కొత్త కొత్త ఆలోచనలు చేయడం వరకు బాగానే వుంది కానీ, మన నేటివిటీ, మన మూలాల సంగతి మరిచిపోతున్నారు. తెలుగు సినిమా ఎంత విస్తరించినా, ఇప్పటికీ మన సినిమాకు మహరాజ పోషకులు బీ..సీ సెంటర్ జనాలు, మహిళలే. వీరికి నచ్చని సినిమా ఆడలేదు కాక ఆడలేదు. అడ్వాన్స్‌డ్ యూజ్ అండ్ త్రో ప్రేమ వ్యవహారాలు, ఇంటర్‌నెట్లు, హైటెక్ మాఫియా వ్యవహారాలు వీరికి పట్టవుకాక పట్టవు. ఆ సంగతి విస్మరించిన తీసిన ప్రతి సినిమా కథ కంచికి వెళ్లక పోగా, ప్రింట్లు నిర్మాత ఇంటి దారి పట్టాయి. జనవరి నుంచి మే అంటే అయిదు నెలల్లో కనీసం ప్రతి నెలా 40 కోట్ల వరకు రీళ్లపాలయ్యాయి. అంటే దాదాపు రెం డు వందల కోట్లు. అది ఎగ్జిబిటర్ల సొమ్ము కావచ్చు.. నిర్మాతలది కావచ్చు. జనవరిలో ‘మిరపకాయ్’ ఒక్కటి గట్టెక్కెంది. వాల్ట్‌డిస్నీ సొమ్ములతో తీసిన ‘అనగనగా ఓ ధీరుడు’, దాసరి ప్రతిష్టాత్మక చిత్రం ‘పరమవీరచక్ర’ సినిమాలు కోట్లకు బోర్లాపడ్డాయి. ముఖ్యంగా ‘పరమవీరచక్ర’ అతి ఘోరంగా దెబ్బతింది. ఈ రెండింటి బడ్జెట్ కలిపి నలభై నుంచి యాభై కోట్ల వరకు వుంటుందని సినీ వర్గాల భోగట్టా. ఇక ఫిబ్రవరిలో మంచు విష్ణు స్వంత ప్రొడక్షన్ ‘వస్తాడు నా రాజు’ కాస్తా, ఫలితం రాబట్టకుండానే వెనుతిరిగింది. ఎంత స్వంత ప్రొడక్షన్ అయినా కనీసం పదికోట్లు తినే వుంటుందని అంచనా. చిత్రమేమిటంటే జనవరి, ఫిబ్రవరిలో వచ్చిన ‘గోల్కొండ హైస్కూలు’ లాంటి చిన్న సినిమా ఫరవాలేదనిపించుకుంటే, ‘అలా.. మొదలైంది’ సినిమా పెట్టుబడికి అయిదు రెట్లు లాభం తెచ్చుకుని, సినిమా జనం ముక్కున వేలేసుకునేలా చేసింది. జనవరిలో వచ్చిన మీడియమ్ బడ్జెట్ సినిమా ‘వాంటెడ్’ కూడా ప్రేక్షకులు ‘వాంటెడ్’ అని వెనుతిరిగింది. ‘గగనం’ లాంటి ద్విభాషా చిత్రం కాస్త బడ్జెట్ దగ్గర పెట్టుకుని తీసింది కాబట్టి అలా అలా గట్టెక్కింది అనుకోవచ్చు. రామ్‌గోపాల్ వర్మ వీర హడావుడి చేసిన ‘కథ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పలరాజు’ బాక్సాఫీసు వద్ద బాక్సు తనే్నసింది. ఆపై ‘దొంగల ముఠా’ సంగతి చెప్పనక్కరే లేదు. నాటకానికి ఎక్కువ... సినిమాకు తక్కువ టైపు అది. మార్చి నెలలో వచ్చిన ‘శక్తి’ ఈ ఏడాదికే పెద్ద అపజయం. సుమారు 40 కోట్లకు పైగా బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా అందరి అంచనాలను తల్లకిందులు చేసింది. ఆ తరువాత వచ్చిన ‘తీన్‌మార్’కు కూడా అదే పరిస్థితి పట్టింది.

ఇన్ని డబ్బులు పోయాయన్న సంగతి పక్కన పెడితే పెద్దగా కొత్తదనం లేకుండానే ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమా ఎలా హిట్టయిందని కూడా ఆలోచించడం అవసరం. అందులో మన సగటు ప్రేక్షకులకు నచ్చే రిలీఫ్ వుంది. వినోదం వుంది. మీదుమిక్కిలి గందరగోళపు, మేధావితనపు వెర్రిపోకడలకు నిదర్శనమైన వెర్రిమొర్రి ఆర్గ్యుమెంట్లు, టెక్నాలజీ హడావుడి లేదు. ప్రతి ఫ్రేమ్ జనం కళ్లకు అలసట నిచ్చేదిగా, హడావుడిగా కాకుండా, హాయిగా వుండడం ప్లస్సయింది. ఎంత అయినా మన సగటు సినీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు ఫ్రేమ్‌లు నిలకడగా కాస్తయినా కనపడాలి. హీరోయిన్‌ను కాస్త చూడగలగాలి. ఇష్టం వచ్చినట్లు మూడు నాలుగు కెమేరాలు వాడేసి, ముక్కలు ముక్కలు చేసి, సెకెండ్‌కో ముక్కను తెరపై తిప్పే గందరగోళపు విధానాలకు మన ప్రేక్షకులు ఇంకా అలవాటు పడలేదు. మంచి సినిమా కోసం మన సినీ జనాలు ఎంతలా మొహం వాచి వుంటున్నారంటే, చెత్త సినిమాల నడుమ కాస్త కుదురుగా వున్న సినిమా ఏ మాత్రం బాగున్నా అక్కున చేర్చుకుంటున్నారు. ‘అలా.. మొదలైంది’, ‘అహ.. నాపెళ్లంట’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాలు ఆడడానికి కారణం అదే. అవే మంత మంచి సినిమాలని ఎవరూ సర్ట్ఫికెట్లు ఇవ్వలేదు. కానీ చెడ్డలో కాస్త మంచి చెడ్డ అన్న తీరుగా అవి నెగ్గుకొచ్చాయి. కానీ ఇవేవీ ఆలోచించకుండా, స్టార్‌కాస్టింగ్, భారీతనం, పబ్లిసిటీ హైప్‌నే నమ్ముకుని జూదమాడుతున్న వారి కారణంగా తెలుగు సినిమారంగంలో కోట్ల రూపాయిలు రీళ్లపాలవుతున్నాయి. ఇదే తీరు కొనసాగితే ఆత్మహత్యలపై సినిమాలు తీయడం కాదు.. సినిమా రంగమే ఆత్మహత్యాసదృశంగా తయారవుతుందేమో? అగ్రదర్శకుడు దాసరి నేరుగా మన హీరోలకు కథలు జడ్జి చేసే సత్తాలేదని సంచలన వాఖ్యలు చేసాడు. కథలు జడ్జి చేయడం ఎలా వున్నా, దర్శకులను ఎంచుకోవడం కూడా సరిగా తెలియదేమో అనిపిస్తుంది ఇటీవల సినిమాలు చూస్తుంటే. ఇటీవల భారీగా బోల్తాపడ్డ సినిమా డైరక్టర్‌కు కనీసం రివర్స్ సీన్‌కు క్లాప్ ఎలా కొడతారో కూడా తెలియదని, కేవలం వివిధ కారణాల రీత్యా అవకాశాలు కట్టబెట్టడం తప్ప, సిసలైన సామర్ధ్యం గలవారికి సినిమా రంగంలో గుర్తింపు తక్కువేనని ఓ అసిస్టెంట్ డైరక్టర్ వ్యాఖ్యానించాడు. కేవలం పైరవీలు, లయిజినింగ్ వంటివే ప్రభావం చూపిస్తున్నాయని, నందినీరెడ్డి లాంటి వాళ్లు ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే అవకాశాలు స్వంతం చేసుకోగలుగుతున్నారని సినిమా రంగంలో గుసగుసలు వుండనే వున్నాయి. ‘నిజానికి ఇప్పుడున్న అగ్రదర్శకులంతా ఒకప్పుడు యువకులుగా, కొత్త దర్శకులుగా అవకాశాలు సంపాదించి, మంచి హిట్లు ఇచ్చారు. ఇప్పుడు వీరి సత్తా పూర్తయింది. కొత్త కుర్రాళ్లకు వీరు దారి ఇవ్వాలి’ అని ఓ అసోసియేట్ దర్శకుడు తన భావనలు వ్యక్తం చేసాడు. కృష్ణవంశీ ఫ్లాప్‌లు ఇస్తుంటే అతని అసోసియేట్ నందినీ రెడ్డి హిట్ ఇవ్వడాన్ని ఈయన ఉదాహరణగా చూపారు. మరో పక్క మన సినిమాల్లో స్టార్ కాస్టింగ్ కూడా పాత్రలను బట్టి కాకుండా, హీరో, దర్శకుడు వారి కోటరీకి అనుగుణంగా జరుగుతున్నాయని, అది కూడా సినిమా విజయంపై ప్రభావం చూపిస్తోందని విమర్శలు వున్నాయి. ఏది ఏమైనా తెలుగుసినిమాకు ఆత్మవిమర్శ అవసరం చాలా వుందన్నది వాస్తవం. అది జరిగే వరకు రీళ్లు ఇలా కోట్లు మింగేస్తూనే వుంటాయి.