Thursday, 14 November 2013

పవన్ కోసం మారుతీ త్యాగం


పవన్  తో  సినిమా కోసం మారుతీ ఎదురుచూస్తున్నాడు 
 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంత క్రేజీ అనేది మళ్ళి  నిరూపణ అయింది 
 సెలెబ్రెటీలంతా తమకు అవకాసం చిక్కినప్పుడల్లా పవన్ పై తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు.  తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా పిజ్జా తెలుగులో కూడా డబ్ చేయబడి విజయం సాధించింది.  పిజ్జా సినిమాకు సీక్వెల్ గా ‘విల్లా’ ను నిర్మించారు. ఈ సినిమాను కూడా తెలుగులో డబ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా మార్కెటింగ్ ను టాలీవుడ్ దర్శకుడు మారుతి పర్యవేక్షిస్తున్నారు. మొదటిగా ఈ సినిమాను ఈరోజు విడుదల చేయాలని గ్రాండ్ గా ప్లాన్ చేసారు. అయితే పవన్ ‘అత్తారిల్లు’ ఈరోజుతో 50 రోజుల పండుగను చేసుకుంటోంది కాబట్టి ‘విల్లా’ సినిమాను ఈరోజు విడుదల చేస్తే పవన్ అత్తారిల్లు అర్ధ శతదినోత్సవానికి అడ్డంగా ‘విల్లా’ మారి చాలా ధియేటర్లలో పవన్ ‘అత్తారిల్లు’ ను తీసివేయవలసి వస్తుంది.   పవన్ ప్రభంజనానికి అడ్డు రాకూడదు అనే ఉదేశ్యం తో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న మారుతీ తదితర వ్యక్తులు ఒక రోజు ఆలస్యంగా ‘విల్లా’ ను రేపటి నుంచి ధియేటర్లలోకి తీసుకువస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడమే జీవిత ధ్యేయంగా తిరుగుతున్న మారుతి పవన్ కోసం ఈ మాత్రం త్యాగంలో ఆశ్చర్యం ఏముంది.

అల్ ది బెస్ట్ మారుతీ 

ఫోన్ లో సమంతా వైద్యం ?



ఫోన్ లో సమంతా వైద్యం ? 
సిద్దార్థ్  పరిచయం అయినప్పటి నుండీ  సమాంత  మనసంత పైనే సిద్దార్థ్  ఉంది.. అది ప్రేమా , కదా  అన్నది తెలియదు 
వీరిద్దరూ ఇప్పటివరకు బహిరంగంగా తమ ప్రేమని వెల్లడించనప్పటికీ, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ ద్వారా ఒకరిపట్ల మరొకరు తమ లవ్ ప్రదర్శిస్తున్నారు. సమంతాని మనవాడు 'బాబీ' అంటూ ముద్దుపేరుతో సంబోధిస్తూ ఉంటాడు.


పొతే, ఇప్పుడు సిద్ధూ ఫ్లూ జ్వరంతో బాధపడుతూ బెడ్ మీద వున్నాడు. అయినా కూడా సమంతాతో ట్విట్టెర్ ద్వారా టచ్‌లోనే వున్నాడు. తన సహా నటుడీ కి  ఒంట్లో బాగుండకపోవడంతో సమంత చాలా ఆదుర్దా పడిపోతోంది. మందులు వేసుకున్నావా? రెస్ట్ తీసుకుంటున్నావా? అంటూ ట్వీట్ చేస్తూ, తెగ ఆందోళన పడిపోతోంది. మరి,దీన్ని ఎమనాలి '''.. 
 ప్రేమంటే అదే కదా

Sunday, 10 November 2013

ఒక పుస్త‌కం రాస్తే 230 కోట్లు ??

ఎవ‌రైన ఒక పుస్త‌కం రాస్తే…మ‌హ డిమాండ్ వుండే 50 ల‌క్ష‌లు రావ‌డం గొప్ప‌. ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ సెలబ్రెటి జీవిత చ‌రిత్ర అయిన కోటి రూపాయ‌లు ప‌ల‌క‌డం గ్రేటే. అటువంటిది ఏకంగా ఒక హీరోయిన్ జీవిత క‌థ రాసుకుంటే.. ప‌బ్లీష‌ర్స్ పోటీ ప‌డి దాదాపు 230 కోట్లు ఇస్తామ‌ని వెంట ప‌డ‌టం ఏమిటి. ..? హాలీవుడ్ లో ఇంత వ‌ర‌కు ఏ ఫిల్మ్ సెలిబ్రిటీ జీవిత చ‌రిత్ర కు క‌నీ విని ఎర‌గ‌ని రీతిలో ధ‌ర ప‌ల‌క‌డం వెన‌క అస‌లు విష‌యం ఏమిటి …? ఒక హీరోయిన్ కు ఇంత డిమాండా..? అస‌లేంటి.. ? అంత గొప్ప‌ద‌నం..ఏముంద‌ని పబ్లిష‌ర్స్ ఆమే రాసుకున్న అత్మ‌క‌థ‌కు పోటీ ప‌డి ధ‌ర పెంచుతున్నారు. …? విష‌యం లేక‌పోతే.. అంత‌గా వెంట ప‌డ‌తారంటారా. నో వే క‌దా.?
అస‌లిదంత ఎవ‌రి గురించి అనుకుంటున్నారా.. ? హాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎంజెలీనా జోలి గురించండోయ్.. హాలీవుడ్ హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా పేరున్న ఈ స్టార్ హీరోయిన్ అత్మ క‌థ కే ప‌బ్లిష‌ర్స్ 230 కోట్లు పే


చేయ‌డానికి పోటీ ప‌డుతున్నారు. తండ్రి న‌టజాన్ వాగిట్ న‌ట వార‌సురాలిగా హాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన ఎంజెలీనా.. రెండు వేల ఒక‌టిలో చేసిన టూంబ్ రైడ‌ర్స్ సినిమా ..జోలిని ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ ని చేసింది. ఈ చిత్రం తో జోలి.. హాలీవుడ్ యాక్ష‌న్ హీరోల‌కు పోటీ గా క్రేజ్ ను గెయిన్ చేసింది. ఆ త‌రువాత అదే కంటిన్యూ చేసింది. ఈ చిత్రం త‌రువాత బియాండ్ బోర్డ‌ర్ … స్కై కెప్ట‌న్ ఆఫ్ ది వ‌ర్క్ ఆఫ్ టుమారో .. ఈ మ‌ద్య వ‌చ్చిన సాల్ట్ సినిమాలు .. జోలిని తిరుగులేని స్టార్ గా నిల‌బెట్టాయి. న‌టిగా అద్భుతాలు చేసిన ఎంజెలిన‌..వ్య‌క్తిగ‌తంగా కూడా ఎన్నో సేవా క్యార్య క్ర‌మాలు చేయ‌డ‌మే ఆమేకు ప్ల‌స్ పాయింట్. ఆమే న‌టిగా కంటే ఆమే చేస్తోన్న స‌మాజ సేవకు అభిమానులు ఎక్కువ‌. స్టైల్స్ ప‌రంగా కూడా ఒక స్టైల్ ఐకాన్ ..ఇలా వ‌ర్స‌టైల్ ప‌ర్స‌న్ కాబ‌ట్టే… ఆమేకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ మ‌రి. అందుకే ఆమే ఆత్మ‌క‌థ కాసుల వ‌ర్షం కురిపిస్తుంద‌ని ప్ర‌చుర‌ణ క‌ర్త‌ల గ‌ట్టిన‌మ్మ‌కం. అయితే ఏంజెలినా మాత్రం ఇంకా త‌న పుస్త‌కానికి ధ‌ర పెరుగుతుంద‌ని వెయిట్ చేస్తుంది. 

Monday, 4 November 2013

శ్వేతా మీనన్ చేప్పేది నిజ్జమా ?



శ్వేతా మీనన్ చేప్పేది నిజ్జమా ?
శృంగార నటి శ్వేతా మీనన్‌ గురించి తెలియని సినీ ప్రేక్షకుడుండడు. 'రతినిర్వేదం' అనే సెక్సీ సినిమాలో నటించిన ఈ భామ... ఆ తర్వాత నాగార్జున చారిత్రక నేపథ్యం ఉన్న 'రాజన్న'లో లేడీవిలన్‌గా నటించింది.
హాట్ గా ఉండే కేరళ నటి శ్వేతా మీనన్‌ చేప్పేది విన్న ను ఆ రాష్ట్ర మీడియా అశ్ఛర్యపోయింది 
కారణం ఒక కేరళ  ఎంపీ పబ్లిక్ లో తనపట్ల అసహ్యం  గా ప్రవర్తించాడని  ఆమే  పోలీస్ లు కు కంప్లెయింట్  చేయ్యటం...
 


 ఇటీవల కేరళలో బోట్‌రేస్‌ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా ఈ నటి హాజరైంది. ఈమె అందాలను చూసి ఆశపడ్డారేమో కానీ... అక్కడ కాంగ్రెస్‌ ఎంపీ పీతాంబర కురూప్‌ ఈమెపై అత్యాచారం యత్నం చేసడని  శ్వేతా మీనన్‌ పోలీస్ లు కు కంప్లెయింట్ చేసింది.. 
ఈ సంఘటనపై మలయాళ పరిశ్రమ నిరసన వ్యక్తం చేసిందని కోలీవుడ్‌ వర్గాలు తెలియజేశాయి. అయితే ఆమె మాత్రం తనకు జరిగిన దానిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిందని చెప్పింది. కానీ, సదరు ఎంపీ మాత్రం ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని అంటున్నాడు. మరి అక్కడి మీడియా ఆమెపై ఎందుకు టార్గెట్‌ చేసిందో తెలియదు. ఇది కేవలం రాజకీయ ఎత్తుగడేనని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.