Friday, 9 August 2013

మళ్ళి పాట పాడిన శ్రుతిహసన్ ...

మళ్ళి పాట పాడిన శ్రుతిహసన్ ...
శ్రుతిహసన్ మంచి గాయని అన్న సంగతి మనకు తెలిసిందే.. ఇప్పుడు శృతిహాసన్ తెలుగు,హిందీ ,తమిళ్ బాషల లో మంచి ఉపూ మీద ఉంది ...  వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగు లో బలుపు హిట్ తరువాత శ్రుతి మార్కెట్  బాగా  పేరిగింది , మరో వైపు  హిందీ సినిమాలతో బిజీగా ఉంది. శృతిహాసన్‌ నటనే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించింది. బేసికల్‌గా మంచి గాయని అన్న సంగతి మనకు తెలిసిందే. సినిమాల్లోకి రాని క్రితమే తాను ఆల్బమ్స్ రిలీజ్ చేసింది.అప్పుడప్పుడు తన సినిమాల్లో కూడా పాటలు పాడుతుంటుంది. ప్రస్తుతం నటన అనేది ఆమె వృత్తి అయితే, సింగింగ్ అనే దానిని హాబీలా పెట్టుకుంది. ఆ క్రమంలో తాజాగా ఓ తమిళ సినిమాకు ఓ ఐటెం సాంగ్ పాడినట్లు తెలుస్తుంది. తెలుగులో హిట్టయిన 'అలా మొదలైంది' చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం శృతి హాసన్ ఓ పాట పాడిందని

సమాచారం.

'కడలి'ఫేం గౌతమ్ కార్తీక్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో...  శ్రుతిహాసన్‌తో ఓ పాట పాడించేశారు ఆ చిత్ర దర్శక, నిర్మాతలు. ఆ పాట ప్రారంభంలో వచ్చే పదం 'షటప్ యువర్ మౌత్'. ఈ పాట తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఆ చిత్రం యూనిట్ సమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

hi everybody you r valuable comments post her type it is very easy..first enter u r coment .go for comments box down..see.. comment as ..click...and secect to anonymous...click publish..మీరు చేసే కామెంట్ కామెంట్ పబ్లిష్ అవ్వలంటే కామెంట్ బాక్స్ కింద ఉన్నcomment as అనె ఆప్షన్ లో అనానిమస్( anonymous.) క్లిక్ చేయ్యండీ .